telugu navyamedia
క్రైమ్ వార్తలు

పోలీసునంటూ బెదిరించి ఇద్దరు బాలికలపై అత్యాచారం..

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఆడవాళ్లకు ఎక్క‌డా రక్షణ లేక‌పోతుంది. రాబంధుల్లా రెచ్చిపోతున్నారు.. ఏవైపు వెళ్లినా కామాంధులే.. మానవ మృగాల కామానికి బ‌లైపోతున్నారు.

తాజాగా ఆంధ్ర‌ప‌దేశ్‌లోని విజయనగరం జిల్లా కురుపాంలో దారుణ ఘటన జ‌రిగింది. ఓ వ్యక్తి.. తాను పోలీసునంటూ బెదిరించి ఇద్దరు బాలికలపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు.

వివ‌ర్లాల్లోకి వెళితే..

నూతన సంవత్సరం సందర్భంగా ఇద్ద‌రు మైన‌ర్  బాలిక‌లు జియ్యమ్మవలస మండలం రేగడి వద్దకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడి నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా రావాడ డ్యాం వ‌ద్ద రాంబాబు అనే వ్యక్తి అడ్డుకుని తాను పోలీసునంటూ బెదిరించ‌డంతో యువతులిద్దరూ బెంబేలెత్తిపోయారు.

ఆపై ఒక‌రి తర్వాత ఒకరిపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత వారిని విడిచిపెట్టాడు .అయితే అక్క‌డ నుంచి వెళ్ళిన యువ‌తులు తమపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబ స‌భ్య‌లుకు తెలిపారు. వీరు స్థానిక గిరిజన బాలికల వసతి గృహాంలో చదువుకుంటున్నారు.

ఈ మేరకు కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అత్యాచారానికి పాల్పడిన నకిలీ పోలీస్ రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. అతడు నేరాన్ని అంగీకరించడంతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.

Related posts