telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు

బైకును ఢీకొట్టిన బస్సు..వాహనచోదకుడు మృతి

over speed costs 4 students
హైదరాబాద్ లో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని ఉప్పల్ ప్రాంతంలో బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తిని అటుగా వెళుతున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో  గాల్లోకి ఎగిరిపడ్డ వాహనచోదకుడు అక్కడికక్కడే  ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఉప్పల్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.
ఈ ప్రమాదంలో రామంతపూర్ కు చెందిన హరినాయక్ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు  తెలిపారు. హరినాయక్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన బస్సు జనగామ డిపోకు చెందినదని పేర్కొన్నారు. బస్సు అతివేగంగా రావడమే ఈ ప్రమాదానికి కారణమని అభిప్రాయపడ్డారు.ఈ మేరకు కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts