బిగ్ బాస్ తెలుగు సీజన్ 5కు కరోనా సెగ తగిలింది. క్వారంటైన్లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ ఐదో సీజన్ సెప్టెంబర్ 5న గ్రాండ్గా ప్రారంభం కాబోతుంది.
తొలి ఎపిసోడ్లో కంటెస్టెంట్లను పరిచయం చేయబోతున్నారు. సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 10 గంటలకు ప్రసారం అవుతుంది. వారాంతం అంటే శనివారం, ఆదివారం ప్రత్యేక ఎపిసోడ్లు రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ అంతా క్వారంటైన్లోకి వెళ్లారు.
అయితే గత ఏడాది మరిదిగానే బిగ్ బాస్ షోకి ఈసారి కూడా కరోనా సెగ తాకింది. బిగ్ బాస్-5 కంటెస్టెంట్స్ లో ఇద్దరు కరోనా బారిన పడినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వారిని క్వారంటైన్ లో ఉంచినట్లు తెలుస్తోంది. అలాగే కంటెస్టెంట్ల లిస్టులో మార్పులు జరిగే అవకాశం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై బిగ్ బాస్ యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇదిలా ఉంటే షో ప్రారంభం కానున్న తేదీ దగ్గర పడుతుండటంతో.. కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
యాంకర్ రవి, లోబో, కార్తీకదీపం ఫేమ్ ఉమాదేవి, నటి లహరి, యానీ మాస్టర్, సిరి హన్మంత్, ట్రాన్స్ జెండర్ ప్రియాంక, నటి ప్రియ, నవ్య స్వామి, సరయు సుమన్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, కోమలి, వర్షిణి, జ్యోతిలు లిస్టులో ఉన్నారు. మరి వీరిలో ఎవరు బిగ్ బాస్ హౌస్లో అడుగుపెడతారో వేచి చూడాలి.
అంతేకాకుండా గత కొద్దిరోజులుగా వీరితో పాటు కొరియోగ్రాఫర్ నటరాజ్, సింగర్ శ్రీరామచంద్ర పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కాగా, బిగ్ బాస్ ఐదో సీజన్కు అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు.