టాలీవుడ్ సీనియర్ నటి గీతాంజలి గుండెపోటుతో హైదరాబాద్ లోని ఫిలింనగర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. ఆమె మృతితో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగింది. సినీ సెలబ్రిటీలు గీతాంజలి మృతికి సంతాపం తెలియజేస్తూ, కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 500 చిత్రాలకి పైగా నటించారు. ఈ క్రమంలో గీతాంజలికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు నందమూరి బాలకృష్ణ. “గీతాంజలిగారు పరమపదించారినే వార్త తెలియగానే షాక్ అయ్యాను. ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలకరించేవారు. మా కుటుంబంతో మంచి అనుబంధం ఉన్న వారిలో ఆవిడ ఒకరు. నాన్నగారంటే ఆవిడకు ఎంతో అభిమానం. నాన్నగారు డైరెక్ట్ చేసిన `సీతారామకళ్యాణం` సినిమాలో సీత పాత్రలో గీతాంజలిగారు నటించారు. నటనలో ఆవిడ నాన్నగారిని ఎప్పుడూ ఇన్స్పిరేషన్గా తీసుకునేవారు. తెలుగు సినిమాల్లో నటిగా తనదైన ముద్ర వేశారు. అలాంటి గొప్ప నటి మనల్ని విడిచిపెట్టి పోవడం ఎంతో బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలి. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అంటూ పోస్ట్ చేశారు.
previous post