టీఆర్ఎస్ కు ఆ పార్టీ సీనియర్ నేత, రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో అరాచకం పెరిగిపోయిందని ఆయన మండిపడ్డారు. తన అనుచరులతో పాటు తనపై కూడా పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్నారని అన్నారు.
సభ్యత్వ నమోదు పుస్తకాలను కూడా ఇవ్వకుండా తనను అవమానపరిచారని చెప్పారు. తాను అడగకుండానే ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవిని ఇచ్చారని, కానీ, కొందరి వల్ల తాను పార్టీలో ఇమడలేకపోతున్నానని తెలిపారు. అయితే, ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయాన్ని మాత్రం ఆయన తెలియజేయలేదు.