సింగరేణిలో భారీ పేలుడు సంభవించింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఓపెన్ కాస్ట్-1లో లోని ఫేజ్-2లో బ్లాస్టింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బ్లాస్టింగ్ కు అవసరమైన ముడిపదార్థాలు నింపుతున్న సమయంలో ఒక్కసారిగా విస్ఫోటనం సంభవించింది. పేలుడు ధాటికి సంఘటన స్థలంలో బీభత్సం నెలకొంది.
ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మహాలక్ష్మి ఓబీ కంపెనీలో బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. గోదావరిఖనిలోని సింగరేణి ఆసుపత్రికి అధికారులు మృతదేహాలను తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
టీఆర్ఎస్ సర్కార్పై రేవంత్ ఫైర్