telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

నెటిజన్‌ ప్రశ్నకు ఎంపీ కవిత ఘాటుగా సమాధానం!

MP Kavitha comments BBP Govt.
తెలంగాణ రాష్ట్రంలో నూతన సచివాలయ నిర్మాణంపై ఓ నెటిజన్‌ ప్రశ్నకు టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత ధీటుగా సమాధానమిచ్చారు. బైసన్‌పోలో మైదానాన్ని  రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా కోరుతూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిన్న కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. దీనిపై నెటిజన్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ.. తెలంగాణకు కొత్త సచివాలయం ఎందుకు అని ప్రశ్నించారు. కేసీఆర్‌, అతని కుటుంబ సభ్యుల మూఢనమ్మకాలు, తెలివి తక్కువ పనులను అడ్డుకుందాం. ఎంపీల విజ్ఞప్తిని తిరస్కరించాలని పేర్కొంటూ పలువురికి ట్విట్‌ చేశాడు.
దీనిపై ఎంపీ కవిత పై విధంగా ఘాటుగా స్పందించారు. నెటిజన్‌ ప్రశ్నకు కవిత ధీటుగా సమాధానమిచ్చారు. డియర్‌ ఫేక్‌ అకౌంట్‌.. పేరు చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు. రియల్‌ కేసీఆర్‌ పేరు వెనుక దాక్కుంటున్నారు. పాత సచివాలయాన్ని మీరు ఎప్పుడైనా సందర్శించారా? అని ఎంపీ ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు గ్రహించకుండా మాట్లాడటం సరికాదన్నారు.

Related posts