telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బస్సు యాత్ర .. రసాభాస.. రోడ్డుపైనే బైఠాయించిన బాబు.. తీవ్ర ఆందోళన..

police stopped bus yatra by protesters

విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం తెదేపా అధినేత చంద్రబాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు ఐకాస నేతలు బస్సు యాత్రను ప్రారంభించేందుకు పాదయాత్రగా బయల్దేరగా.. పోలీసులు అక్కడ భారీగా మోహరించి వారిని అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు సహా నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడితే పోలీసులు ఏమీ చేయలేరన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అరెస్టులతో తమను ఆపలేరన్నారు.

అనంతరం చంద్రబాబుతో పాటు ఇతర నేతలంతా బెంజిసర్కిల్‌ వద్ద రోడ్డుపైనే భైఠాయించారు. పోలీసులు వారితో చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అమరావతి ఐకాస నేతల బస్సుయాత్రకు అనుమతివ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని ప్రశ్నించారు. తాము చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని.. ఎందుకీ దౌర్జన్యమని పోలీసులను నిలదీశారు. ఎంతమందిని అరెస్ట్‌ చేస్తారో చేసుకోవాలని.. పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. ఏ చట్టం ప్రకారం తమను అడ్డుకుంటున్నారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. పోలీసులు మాత్రం ఐకాస బస్సుయాత్రకు అనుమతి లేదని తేల్చి చెబుతున్నారు.

Related posts