హాంకాంగ్పై చైనా పెత్తనాన్ని నిరసిస్తున్న అమెరికా డ్రాగన్ కంట్రీపై చర్యలకు సిద్ధమవుతోంది. తాము తీసుకునే నిర్ణయం చాలా కఠినంగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అదేదో వారం రోజుల్లో తెలుస్తుందని, అప్పటి వరకు వేచి చూడాలని విలేకరులను కోరారు. అంతేకాదు, తాము తీసుకునే నిర్ణయం అత్యంత ఆసక్తి కలిగించేదిగా ఉంటుందని, అది చాలా శక్తిమంతమైన నిర్ణయమంటూ ఆసక్తిని పెంచే వ్యాఖ్యలు చేశారు.
స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన హాంకాంగ్ను స్వాధీనం చేసుకునేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న చైనా.. హాంకాంగ్లో జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేసేందుకు అనువుగా ముసాయిదా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. చైనా తీరుపై హాంకాంగ్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ఆ దేశాన్ని గుప్పిట్లో పెట్టుకుని, తమ కంపెనీలను బ్రిటన్ స్టాక్ ఎక్స్చేంజ్లలో లిస్ట్ చేయడం ద్వారా అమెరికాకు చెక్ చెప్పాలని భావిస్తోంది. ఇది ముందే గ్రహించిన ట్రంప్ చైనాపై చర్యలు తప్పవని ఇటీవల ప్రకటించారు. తాజాగా మరోసారి అదే విషయాన్ని పునరుద్ఘాటించారు.
పేదల రాజ్యాన్ని జగన్ పులివెందులగా మార్చారు: నారా లోకేష్