telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బొల్లారంలో అగ్నిప్రమాదం…సందర్శించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడ లోని వింధ్య ఆర్గానిక్స్ కెమికల్ రసాయన పరిశ్రమ లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటన స్థలాన్ని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గం లోని పారిశ్రామికవాడ ల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న ప్రమాదాల పైన ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, ప్రమాదాలకు గల కారణాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్తామని తెలిపారు. సురక్షిత ప్రమాణాలు పాటించని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. కాగా.. ఈ ప్రమాదంలో తీవ్రంగా ఎనిమిది మంది గాయపడ్డారు. వీరి పేర్లు కూడా బయటపెట్టారు పోలీసులు. వెంకటేశ్, రితికేష్ కోమల్, ఇరేష్ రేష్మా, క్రిష్ణ మల్లిక్ , విద్యాభాను సింగ్ , రాజారావు , రాజు , ఆనంద్ పార్థి గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై పోలీసుల విచారణ చేస్తున్నారు. 

Related posts