కలువ కళ్ళ సుందరి కాజల్ ఈ ఏడాది సీత, రణరంగం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలో ఆమె నటించిన “పారిస్ పారిస్” చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం కమల్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న “భారతీయుడు-2” చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. “ముంబై సగ” అనే బాలీవుడ్ చిత్రంలోను ప్రధాన పాత్ర పోషిస్తుంది. తాజా సమాచారం ప్రకారం నాగార్జునతో తొలిసారి నటించేందుకు ఈ అమ్మడు సిద్ధమైనట్టు తెలుస్తుంది. నాగార్జున నటించిన “ఊపిరి” చిత్రానికి రచయితగా పని చేసిన సోలోమాన్ దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. త్వరలో నాగ్ ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని తెరకెక్కించనుండగా, ఇందులో కాజల్ని కథానాయికగా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. డిసెంబర్లో చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. కాజల్, నాగ్ తనయుడు నాగ చైతన్యతో కలిసి “దఢ” చిత్రంలో నటించినప్పటికి, నాగ్తో ఒక్క చిత్రం కూడా చేయలేదు. మరి ఈ కాంబినేషన్ ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
previous post
“మహానాయకుడు”పై లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు