telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

బండి సంజయ్ కి డీఎన్ఏ టెస్ట్ చేయించాలి..!

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మీడియాతో మాట్లాడుతూ… బండి సంజయ్ కి డీఎన్ఏ టెస్ట్ చేయించాలి అన్నారు. కొంత మంది దేశీయ దొంగలు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ప్రగల్భాలు పలికారు… బడా జూటా పార్టీ నేతలు మాట్లాడిన అబద్ధాలకు సత్య హరిచంద్రలు ఉంటే ఆత్మహత్యలు చేసుకునేవారు అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీలో 172 మంది ఎంపీలపై, 26 మంది కేంద్ర మంత్రులపై ఆరోపణలు ఉన్నాయన్న టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే… మమ్మల్ని మాఫియా అంటారా? బీజేపీదే మాఫియా పార్టీ ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల భావోద్వేగాలతో ఆడుకునే పార్టీ బీజేపీ.. బండి సంజయ్ బోడి సంజయ్… అమిత్ షా కేసుల్లో ఇరుక్కుని రెండేళ్లు ఢిల్లీలో తలదాచుకున్నారు అంటూ ఎద్దేవా చేశారు. మా ప్రగతి భవన్ ప్రగతికి నిదర్శనం.. అభివృద్ధిపై బోడి సంజయ్ మాతో చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ చేశారు గాదరి కిషోర్.. నల్లధనం తేక పోగా.. నల్ల కుబేరులను దేశం దాటించిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అంటూ సెటైర్లు వేసిన ఆయన.. రెండు ఎన్నికల్లో గెలవగానే బీజేపీ నేతలు గాల్లో సన్యాసం చేస్తున్నారంటూ… కొన్ని రోజుల్లోనే బండి సంజయ్ కథ ముగుస్తుందంటూ జోస్యం చెప్పారు. బండి సంజయ్ అసలు హిందువేనా ? అనే అనుమానాలను వ్యక్తం చేసిన కిషోర్… బండి సంజయ్‌కి డీఎన్ఏ టెస్ట్ చేయించాలి.. అసలైన హిందువు అయితే బండి సంజయ్ ఇలా మాట్లాడరు అని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ను దూషిస్తే తెలంగాణను దూషించినట్టేనన్న ఆయన.. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయక పారిపోయిన వ్యక్తి కిషన్ రెడ్డి అని గుర్తుచేశారు.

Related posts