ప్రస్తుతం బీజేపీలో బండి సంజయ్ వర్సెస్ కిషన్ రెడ్డి అన్నట్టు పరిస్థితి ఉందని హరీష్ రావు విమర్శించారు. బీజేపీ ఆఫీసులో కుర్చీలు గాల్లోకి ఎగురుతున్నాయన్న అయన అంగీలు….లాగులు చినుగుతున్నాయని అన్నారు. మీలో సయోధ్య లేదు..ప్రజలకేం చేస్తారు.. ? అని హరీష్ రావు ప్రశ్నించారు. బీజేపీలో నాయకత్వం కోసం బండి సంజయ్ వర్సెస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నట్లుగా అగ్గిరాజుకుందని హరీశ్ రావు అన్నారు. టికెట్ రాలేదని బీజేపీ ఆఫీసులో అంగీలు, లాగులు చింపుకుంటున్నారు. తలలు పగులగొట్టుకుంటున్నారు. బీజేపీ నేతలమధ్యే సయోధ్య లేదు. వీళ్లు ఇంక ప్రజల కోసం ఏం చేస్తారు ? అ ని అయన ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం బెంగళూరు లో వరదలు వస్తే 600 కోట్లు ఇచ్చారని గుజరాత్ లో వరదలు వస్తే 500 కోట్లు ఇచ్చాారని కాని హైదరాబాద్ లో వరదలు వస్తే ఒక్క రూపాయి ఇవ్వలేదని అన్నారు. తెరాస ప్రభుత్వం వరద సాయం అందిస్తుంటే , బీజేపీ పార్టీ దాన్ని కూడా అడ్డుకుంటోందని ఎన్నికల కమిషన్ కు వరద సాయం ఇవ్వకూడదని బీజేపీ పార్టీ ఫిర్యాదు చేసిందని అన్నారు. ఇలా హైదరాబాద్ కు అన్యాయం చేసిన పార్టీ బీజేపీ హైదరాబాద్ కు అన్యాయం చేసిన పార్టీ బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలి ? అని ప్రశ్నించారు. పెద్ద నోట్లు రద్దు చేస్తామని మోదీ ప్రకటించారు. కాని రద్దయ్యాయా.. ? వేయి రూపాయల నోట్లు రద్దు చేసి ప్రజలను రోడ్డు మీద పడేసి రెండువేల నోట్లు తెచ్చారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం విధానాల వల్ల దేశం ఆర్థిక మందగమనం దిశగా దిగజారిందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ లివబుల్ సిటీగా రూపుదిద్దుకుంది. ఆరేళ్ళలో నగరంలో గొడవలు లేవు. బాంబు పేళుళ్లు లేవు. హైదరాబాద్ లో ప్రజలు ఆత్మవిశ్వాసం తో , భద్రత మధ్య జీవిస్తున్నారని హరీష్ తెలిపారు.
previous post