ఈ మధ్య ఏపీలో వరుసగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అందులో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో వైసీపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. 75 మున్సిపాలిటీలకు గాను 73 చోట్ల విజయం సాధించగా, 11 కార్పొరేషన్లను వైసీపీ సొంతం చేసుకుంది. విశాఖ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లలో మినహా ఎక్కడా కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. విశాఖ మేయర్ ఎన్నికల బరిలో టీడీపీ కూడా నిలబడబోతున్నది. మేయర్ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులు ఎవరు అన్నది రేపు నిర్ణయించబోతున్నారు. తెలుగుదేశం పార్టీకి 30 మంది కార్పొరేటర్లు ఉండగా, ఐదు మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. వైసీపీ 58 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వైసీపీ బలం ఉన్నప్పటికీ టీడీపీ తన ఉనికిని చాటుకోవడానికి పార్టీ అభ్యర్థులను నిలబెట్టేందుకు సిద్ధం అయ్యింది. అయితే ఇప్పుడు టీడీపీ చేసిన చర్య పై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి.
previous post