telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

రేపటి నుంచి ఎండలు మెండుగ!

this summer exceeds 47 degress and more

తెలంగాణలో గురువారం నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతున్నదని వెల్లడించింది. దీని ప్రభావం తెలంగాణపై నామమాత్రమేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిన ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉన్నద్రోణి బలహీనపడిందని ప్రకటించింది. దక్షిణ పశ్చిమ బంగాళాఖాతంలో ఈ నెల 25న అల్పపీడ నం ఏర్పడే అవకాశమున్నదని భారత వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

Related posts