ఢిల్లీలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కుమారుడు మయాంక్ వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం హాజరయ్యారు. వేడుకలో పాల్గొనేందుకు ఎర్రవల్లిలోని యాగశాల నుంచి మంగళవారం ఢిల్లీకి వెళ్లిన ఆయన.. కేంద్ర హోంశాఖమంత్రి రాజ్నాథ్సింగ్, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి, బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్కుమార్ మల్హోత్రా తదితరులతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 8.30 గంటలకు ఎర్రవల్లికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు కే కేశవరావు, బీ వినోద్కుమార్, బూర నర్సయ్యగౌడ్, జోగినిపల్లి సంతోష్కుమార్, బండా ప్రకాశ్ తదితరులు