telugu navyamedia
రాజకీయ వార్తలు

రేపు ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో.. అరుణ్‌జైట్లీ అంత్యక్రియలు

arun jaitly health condition is very serious

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ అంత్యక్రియలను రేపు ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో నిర్వహించనున్నారు. ఎయిమ్స్‌ ఆస్పత్రి నుంచి పార్థివదేహాన్ని కైలాష్‌ కాలనీలో జైట్లీ నివాసానికి తరలించారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో జైట్లీ భౌతికకాయం ఉంచనున్నారు.

పార్టీనేతలు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనకు పార్థివదేహాన్ని కార్యాలయంలో ఉంచుతారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధాని నరేంద్రమోదీ తరఫున బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, కేంద్ర మంత్రి హర్షవర్దన్‌ జైట్లీ భౌతికకాయానికి నివాళులర్పించారు.

Related posts