తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్లో కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహనా కల్పించడానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విజయ్ దేవరకొండతో ఒక ప్రజా ప్రయోజన ప్రకటనను జారీ చేసింది. ఆ తరవాత మహేష్ బాబు సహా పలువురు హీరోలు ట్విట్టర్ ద్వారా స్పందించారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఒక వీడియో చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. WHO సూచించిన ఆరు సూత్రాలను ఈ వీడియోలో ఈ ఇద్దరు స్టార్ హీరోలు వివరించారు. అయితే, కరోనా వైరస్ గురించి నేచురల్ స్టార్ నాని కాస్త వెరైటీగా స్పందించారు. ‘‘పాలిటిక్స్, కులం, మతం, పవర్, డబ్బు, ఫేమ్ తొక్క తోలు ఏమీ ఉండదు. చివరకి మనిషికి మనిషే. మనమంతా ఒక పెద్ద కుటుంబం. ఒకరిపై ఒకరు జాగ్రత్త తీసుకోవడం ఎంతో అవసరం. బాధ్యతగా ఉండండి.. భద్రంగా ఉండండి’’ అని నాని ట్వీట్ చేశారు.
పాలిటిక్స్, కులం, మతం, పవర్, డబ్బు, ఫేమ్ తొక్క తోలు ఏమీ ఉండదు చివరకి
మనిషికి మనిషే
We are all one big family and we need to take care of each other #BeResponsible #BeSafe
— Nani (@NameisNani) March 17, 2020