telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

నేడు సీబీఎస్‌ఈ పది పరీక్ష ఫలితాలు విడుదల

exam hall

సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) 10వ తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ మంగళవారం ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ఫలితాల విడుదల సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో పదో తరగతి వార్షిక పరీక్షలు రద్దయినందున ప్రత్యామ్నాయ మూల్యాంకన విధానం మేరకు బోర్డు ఫలితాలను ప్రకటించనుంది.

కరోనా సంక్షోభం కారణంగా సీబీఎస్ఈ పరీక్షలపై కొన్నిరోజులుగా తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. కొన్ని పరీక్షలు నిలిచిపోవడంతో వాటికి రీషెడ్యూల్ కూడా ప్రకటించింది. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు కరోనా పరిస్థితుల పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో పరీక్షలు రద్దు చేసిన సీబీఎస్ఈ ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించింది.

Related posts