telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం!

tirumala temple

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 9 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 6 గంటల వరకూ సమయం పడుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తుల సంఖ్య అధికంగా ఉన్నందున వారికి దర్శనానికి 3 గంటల వరకూ సమయం పడుతోంది.

దివ్య దర్శనం, రూ. 300 ప్రత్యేక దర్శనం భక్తులకు రెండు గంటల్లో దర్శనం పూర్తవుతోందని అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 69,510 మంది భక్తులు దర్శించుకున్నారని, 22,675 మంది తలనీలాలు సమర్పించారని, హుండీ ద్వారా రూ. 2.76 కోట్ల ఆదాయం సమకూరిందని వెల్లడించారు.

Related posts