telugu navyamedia
క్రైమ్ వార్తలు

చిత్తూరులో ఘోర రోడ్డుప్రమాదం ..ముగ్గురు కర్ణాటక పోలీసులు మృతి.

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చిత్తూరు నుండి తిరుపతి వైపుగా కర్ణాటక పోలీసులు వాహనంలో వస్తుండగా వాహనం అతివేగం కారణంగా అదుపు తప్పి అండర్ బ్రిడ్జ్ వద్ద ఇనుప పిల్లర్ ను ఢీకొని బొల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘ‌ట‌న ఆదివారం తెల్లవారుజామున నాయుడుపేట – పూతలపట్టు జాతీయ రహదారిలోని పి.కొత్త కోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది.

వివరాల్లోకి వెళితే.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎస్సై అవినాష్, కానిస్టేబుల్ అనిల్, ప్రైవేటు డ్రైవర్ ఈ ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి సంఘటన స్ధలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గాయపడిన ఎస్సై దీక్షిత్, కానిస్టేబులను శరవణ, బసవలను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్ధితి విషమంగా ఉండడంతో వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు.

కర్ణాటక పోలీసులు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న నిందితులను పట్టుకునేందుకు వేళ్తుండగా ఉదయం 4:30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని చిత్తూరు డిఎస్పి సుధాకర్ రెడ్డి తెలిపారు.

Related posts