జూన్ 14న ముంబైలో తన నివాసం ఉంటున్న ఇంట్లోనే సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో సుశాంత్ మృతిపై కుటుంబసభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సుశాంత్ మృతి కేసును సీబీఐకు అప్పిగిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కాగా సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్ లో భారీ ప్రకంపనలే సృష్టించింది. నెపోటిజంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జొహార్, అలియా భట్, మహేశ్ భట్ వంటి వారిపై అభిమానులు మండిపడ్డారు. ఇలాంటి సమయంలో సంజయ్ దత్, పూజా భట్, ఆదిత్యరాయ్ కపూర్, ఆలియా నటించిన ‘సడక్ 2’ సినిమా ట్రైలర్ విడుదల అయింది. ఈ ట్రైలర్ ప్రపంచంలోనే రెండో మోస్ట్ డిస్లైక్డ్ వీడియోగా చరిత్ర సృష్టించింది. ఈ ట్రైలర్ను ఇప్పటివరకు ఏకంగా 61 మిలియన్ల మంది చూశారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి నేపథ్యంలో డిస్లైకుల వర్షం కురిసింది. ఏకంగా 11.65 మిలియన్ల మంది ఈ వీడియోను డిస్లైక్ చేశారు. ఇక 18 మిలియన్ల డిస్లైకులతో ‘యూట్యూబ్ రివైండ్ 2018 : ఎవ్రీ వన్ కంట్రోల్స్ రివైండ్వీ’ వీడియో ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉంది. రెండో స్థానంలో జస్టిన్ బీబర్ బేబీ పాట ఉంది. కాగా, 1991లో సంజయ్దత్, పూజా భట్ జంటగా నటించిన ‘సడక్’కు సీక్వెల్గా ‘సడక్ 2’ వస్తోంది. సుశాంత్ సింగ్ మీద ఉన్న జాలి, ప్రేమ కారణంగా సోషల్ మీడియాలో అలియా భట్ వంటి వారిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
previous post
మగాళ్లను ద్వేషించే జాబితాలో లేను : శృతి హాసన్