నేడు వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయన తీసిన మొదటి ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. చిరంజీవి తీసిన ఈ మొదటి ఫొటొలో ఐదుగురు చిన్న కుర్రాళ్లు ఉన్నారు. అయితే ‘‘ఈ ఐదుగురిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు.. చెప్పుకోండి చూద్దాం’’ అని చిరంజీవి ఛాలెంజ్ విసిరారు. చిరంజీవి ప్రశ్నకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆ బాగా తెలిసిన వ్యక్తి ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సరిగ్గా మధ్యలో నిలబడిన కుర్రాడు. పవన్ కళ్యాణ్ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ‘అగ్ఫా3’ కెమెరాతో ఈ ఫొటోను తీశారాయన. ‘అగ్ఫా3’ కెమెరా ఫొటోను కూడా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇదిలా ఉంటే, చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈనెల 22న విడుదల చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
నేను తీసిన మొదటి ఫోటో … … ఈ ఐదుగురిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు … …చెప్పుకోండి చూద్దాం. #FirstPhotoTaken #WorldPhotographyDay pic.twitter.com/YyesoiiivX
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 19, 2020
ఇవ్వాళ #WorldPhotographyDay నేను మొదటి ఫోటో తీసింది ఇలాంటి #agfa3 కెమెరాతో. ఆ మొదటి ఫోటో మరి కాసేపటిలో…. … pic.twitter.com/YnVdZPOgys
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 19, 2020