రాయలసీమకు రాజధాని ఇవ్వాలని జ్యసభ సభ్యుడు, బీజేపీ నేత టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. రాజధాని విషయంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్ లాగే ఏపీకి కూడా రెండు రాజధానులు ఏర్పాటు చేయాలని అన్నారు. రాజధాని కోసం శాంతియుతంగా ఉద్యమం చేస్తామని వెల్లడించారు.
చంద్రబాబు కారణంగా రాయలసీమకు రూ.50 కోట్ల మేర ఉపాధి నిధులు రాలేదని ఆరోపీంచారు. రాయలసీమను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదుకోవాలని కోరారు. రాయలసీమకు ఆగిపోయిన నిధులను ప్రస్తుత ప్రభుత్వం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం నిధులను ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం..