telugu navyamedia
క్రైమ్ వార్తలు

సింగరేణిలో ఘోర ప్రమాదం..నలుగురు మృతి

పెద్దపల్లి జిల్లాలో సింగరేణిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రామగుండంలోని ఓ బొగ్గు గని కూలి నలుగురు మృతి చెందారు.మృతి చెందిన వారిలో ముగ్గురు కార్మికులతో పాటు మరో అసిస్టెంట్ మేనేజర్ కూడా ఉన్నారు.

వివ‌రాల్లోకి వెళితే..

పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలోని సింగరేణి ఆండ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టు గనిలో ప్రమాదం జరిగింది. బొగ్గు గని పైకప్పు కూలి నలుగురు మృతి చెందారు. మృతుల్లో అసిస్టెంట్‌ మేనేజర్‌, ముగ్గురు కార్మికులు ఉన్నారు. రాళ్ళ కింద మరో నలుగురు కార్మికులు చిక్కుకున్నారు. గల్లంతైన మరో నలుగురి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

గనిలో చిక్కుకున్న వారిని తేజ అసిస్టెంట్ మేనేజర్, జాది వెంకటేశ్వర్లు–ఆపరేటర్, రవీందర్— వర్కర్, పిల్లి నరేష్ కార్మికుడు, మీస వీరయ్య –సపోర్ట్‌మెన్ గా గుర్తించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related posts