telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

ఘోర రోడ్డు ప్రమాదం.. 7 మృతి.. 34 మందికి తీవ్ర గాయాలు..

over speed costs 4 students

ఇటీవల రోడ్డు ప్రమాదాలు తీవ్రతరం అవుతున్నాయి. రోజు కనీసం పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో బస్సుల వంటి భారీ వాహనాలు ముందుండటం విచారకరం. దీనితో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తాజాగా, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయిన్‌పురి సమీపంలో ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వే రహదారిపై వస్తున్న ఓ బస్సు.. లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహకారంతో సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. దిల్లీ నుంచి వారణాసి వైపుగా వెళ్తున్న బస్సు అతివేగం కారణంగా అదుపు తప్పి లారీని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. ఈ ఘటనలో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతులను శవపరీక్ష నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Related posts