ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్ర మహిళా ఉద్యోగులకు మంగళవారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మార్చి (మంగళవారం) 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకుంది.
ఏటా మహిళా దినోత్సవం నాడు ప్రభుత్వం సెలవు ప్రకటిస్తోంది. ఈ మేరకు రేపు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అటు పలువురు మంత్రులు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో వారు చేస్తున్న కృషిని ప్రశంసించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు సన్మాన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణలోని మహిళలకు సరైన గుర్తింపు వచ్చిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనపరిచిన మహిళలను మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణి దేవి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి కలిసి సన్మానం నిర్వహించారు
బీజేపీ వాళ్లు నలుగురు గెలవగానే ఆగడం లేదు: కేటీఆర్