తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మెన్ ఘంటా చక్రపాణి, సెక్రటరీ వాణీ ప్రసాద్కు తెలంగాణ హైకోర్టు రూ. 2000ల జరిమానా విధించింది.కోర్టు ఆదేశాలను ఉద్దేశ్యపూర్వకంగా అమలు చేయనందుకు హైకోర్టు జరిమానాను విధించింది. జస్టిస్ ఎంఎస్ రామచంద్రారావు ఈ మేరకు మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు టీఎస్పీఎస్సీ సెక్రటరీ వాణీ ప్రసాద్ సర్వీస్ రికార్డుల్లో ఈ అంశాన్ని నమోదు చేయాలని కూడ కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2017 ఏప్రిల్ మాసంలో టీఎస్పీఎస్సీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేష్ ఇచ్చింది. అదే ఏడాది మే మాసంలో రాత పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలు రాసిన వారు కొందరు 2017లో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు గతంలో కూడా టీఎస్పీఎస్ సీ అధికారులకు జరిమాన విధించింది.