రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా గంగుల కమలాకర్ అన్నారు. ఖైరతాబాద్లోని బీసీ కమిషన్ కార్యాలయంలో ఈ రోజు గంగుల బాధత్యలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయాన మాట్లాడుతూ తనకు మంత్రి పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
రెండు శాఖల ద్వారా బడుగు, బలహీన వర్గాలకు సేవ చేసే అవకాశం ఇచ్చారన్నారు. సీఎం కేసీఆర్ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయను అని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం జలాలు తీసుకొచ్చారన్నారు. ఖరీఫ్లో ధాన్యం పెరిగే అవకాశం ఉందన్నారు. బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలకుండా చర్యలు తీసుకుంటాం అని మంత్రి స్పష్టం చేశారు.
ప్రచారానికి డబ్బులు లేవు .. కిడ్నీ అమ్ముకుంటా