telugu navyamedia
రాజకీయ వార్తలు

మోదీతో మమతాబెనర్జీ భేటీ

mamatha benerji

ప్రధాని నరేంద్ర మోదీతో బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో బుధవారం ఇద్దరు సమావేశమయ్యారు. మోదీ మంగళవారం తన 69వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మమత తన తరఫున మోదీకి బెంగాలీ స్వీట్స్‌ను బహుకరించారు. మోదీని మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భేటీ అనంతరం మమత మాట్లాడుతూ.. తమ మధ్య సమావేశంఎంతో ఆనందంగా జరిగిందన్నారు.

బెంగాల్‌ రాష్ట్ర పేరు మార్పులో ప్రధాని సానుకూలంగా స్పందించారని ఆమె చెప్పారు. ఈ భేటీలో పలు అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పలు సమస్యలు, ఎన్‌ఆర్‌సీ గురించి మమత ప్రధాని దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. కాగా ప్రధానిగా మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరవాత వీరిద్దరి మధ్య భేటీ జరగడం​ ఇదే తొలిసారి కావడంతో రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Related posts