telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వ జీవోలను వెబ్‌సైట్లలో ఉంచాలని హైకోర్టులో పిటిషన్‌

funds to telangana by central govt

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే జీవోలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఉంచాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ప్రభుత్వం జారీ చేసే జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదని పేరాల శేఖర్ అనే వ్యక్తి ఈ మేరకు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు.

ఇప్పటివరకూ లక్షకుపైగా జీవోలను తెలంగాణ ప్రభుత్వం జారీ చేయగా అందులో 42,500 జీవోలను వెబ్‌సైట్లలో పొందుపరచలేదని ఆయన తన పిటిషన్‌లో తెలిపారు. ఈ క్రమంలో బుధవారం పిటిషన్‌ను విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది.

Related posts