హైదరాబాద్ లో కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో పోలీసులు కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. ఈ కేసులో సంబంధం ఉన్న వ్యక్తులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు, ఆమె భర్త భార్గవ్ రామ్ కు ఈ కేసులో సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కేసీఆర్ సమీప బంధువులను కొంతమంది కిడ్నాప్ చేయడంతో పోలీసు శాఖ అప్రమత్తం అయ్యింది. ఈ కేసులో ఏ 1 గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ2 గా భూమా అఖిలప్రియ, ఏ3 గా భార్గవ్ రామ్ పేర్లను పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ చేసిన అనంతరం గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్యపరీక్షల అనంతరం ఆమెను సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరిచారు. కాగా,కేసును విచారించిన న్యాయమూర్తి అఖిలప్రియకు రిమాండ్ విధించింది. ఈనెల 20 వరకు రిమాండ్ విధించారు. రేపు ఉదయం ఆమెను చంచల్ గూడ మహిళా జైలుకు తరలించే అవకాశం ఉన్నది. కాగా, ఈరోజు రాత్రి భూమా అఖిలప్రియను బేగంపేటలోని మహిళా పోలీస్ స్టేషన్ లోనే ఉంచుతారని సమాచారం. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.
previous post
విపక్ష నేతలు గులాబీ గూటికి బారులు: జగదీష్ రెడ్డి