telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

కర్ణాటక : .. పబ్జీ పిచ్చిలో … తండ్రిని చంపుకున్న ఇంజనీరింగ్ విద్యార్థి..

New couples attack SR Nagar

పబ్జీ ఆటలు ఆడడం వ్యసనంగా మారటంతో విచక్షణ కోల్పోయిన విద్యార్థి. బెళగావి జిల్లా కాకతి గ్రామానికి చెందిన రఘువీర్‌ డిప్లొమో విద్యార్థి. మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల ఓ రాత్రి పక్కింటి తలుపులు తట్టి తనకు రక్తం కావాలంటూ కేకలు వేశాడు. అతని మానసిక పరిస్థితిని గుర్తించిన వారు తలుపుల్ని తీయలేదు. అసహనంతో వాటిని బద్దలు కొట్టేందుకు ప్రయత్నించాడు. అనంతరం కిటికీని బద్ధలు కొట్టేందుకు యత్నించాడు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం తండ్రి శంకరప్ప కమ్మారతో కలిసి పోలీసుస్టేషన్‌కు చేరుకున్న రఘువీర్‌ అక్కడ కూడా పిచ్చిపిచ్చిగా వ్యవహరించాడు. పరుగులు తీశాడు. పోలీసులు ఆ యువకుడిని మందలించి పంపించారు.

ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం మొబైల్‌లో ఆడడం మొదలు పెట్టాడు. ఇంటర్నెట్‌ ప్యాక్‌ గడువు ముగిసిందని, రీఛార్జ్‌ చేయించాలంటూ తన తండ్రిపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. ఎప్పుడూ ఆటలేనా అంటూ ఆయన చరవాణిని లాక్కున్నారు. ఈ నేపథ్యంలో రఘువీర్‌ నిద్రలేచి తన తల్లిని ఓ గదిలో బంధించాడు. తండ్రిపై తొలుత కత్తెరతో దాడి చేశాడు. ఆపై..అందుబాటులో ఉన్న కత్తి పీటతో తలను నరికాడు. కాళ్లు, చేతుల్ని కూడా ముక్కలు చేశాడు. గదిలో బందీగా మారిన అతని తల్లి పెద్దపెట్టున కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు అక్కడకు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వారు చేరుకునేలోపే శంకరప్ప కన్నుమూశారు. నిందితుడిని అతికష్టంపై అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తీసుకెళ్లామని, కేసు నమోదు చేశారు.

Related posts