telugu navyamedia
తెలంగాణ వార్తలు

రేపు తెలంగాణ మంత్రివర్గం అత్య‌వ‌స‌ర‌ భేటీ

*రేపు తెలంగాణ కేబినేట్ అత్య‌వ‌స‌ర‌ స‌మావేశం..

* రేపు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మంత్రివ‌ర్గ స‌మావేశం

*ధాన్యం కొనుగోలుపై కీలకమైన ప్రకటన

తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 12వ తేదీ మంగళవారం జరనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించనున్నారు.

ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2గంటలకు జరిగే సమావేశానికిమంత్రులు అంద‌రూ హాజ‌రు కానున్నారు. . ధాన్యం కొనుగోలు స‌హా ప‌లు కీలకమైన అంశాలపై సమావేశంలో చర్చించి కేబినెట్ ఆమోదం తెలుపనుంది.

ఇక, రాష్ట్రంలో పండించిన యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి సీఎం కేసీఆర్.. కేంద్రానికి 24 గంటల డెడ్ లైన్ పెట్టారు .

24 గంటలలోపు ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే రైతు ఉద్యమంతో భూకంపం సృష్టిస్తామని చెప్పారు. రైతు సమస్యలపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు.

Related posts