telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

నాగార్జున సాగర్ : అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ…

నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. దుబ్బాక, జిహెచ్ఎంసీ పలితాలతో దూకుడు మీద ఉన్న కమలనాధులు, ఇటు గులాబీ పార్టీ సైతం అభ్యర్ది ఎంపిక విషయంలో తర్జన భర్జన పడి ఈరోజు నోముల భగత్ ను ఎంపిక చేసింది. ఇక తాజాగా డాక్టర్ పానుగోతు రవికుమార్‌ నాయక్‌ పేరును నాగార్జునసాగర్ ఉప ఎన్నిక అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది బీజేపీ అధిష్టానం. అయితే సాగర్ ఉపఎన్నిక కాంగ్రెస్, బీజేపీ లకు చావోరేవోలా తయారైంది. ఇక ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి గా జానారెడ్డిని పోటీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం జనరల్ కేటగిరి అయినప్పటికీ.. ఎస్టీ అభ్యర్థిని బరిలోకి దింపింది బీజేపీ. రేపటితో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండగా రవికుమార్ అలాగే తెరాస అభ్యర్థి నోముల భగత్ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే చూడాలి మరి ఈ ఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

Related posts