తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన రైతు బంధు చెక్కులు కాంగ్రెస్ నాయకుల ఇళ్లకు కూడా వెళ్తున్నాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్లో జహీరాబాద్ పార్లమెంటు టీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయన మాట్లాడుతూ ఎర్రకోట మీద జెండా ఎవరు ఎగరవేయాలో మనమే నిర్ణయించాలని అన్నారు.
బీజేపీ మతం పేరిట రాజకీయం చేస్తోందని విమర్శించారు. 16 ఎంపీ స్థానాలు గెలిచి ఏం చేస్తారని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారని, ఇద్దరు ఎంపీలతో కేసీఆర్ తెలంగాణ తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కడివారక్కడ పని చేసి బూత్ లెవెల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.