telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో అరాచక పాలన..కేంద్రం దృష్టిసారించాలి: యనమల

Yanamala tdp

వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. శాసన మండలి రద్దు విషయంలో జగన్‌ చేస్తోన్న ప్రయత్నాలను ఆయన ప్రస్తావించారు. ఏపీలో కొనసాగుతోన్న అరాచక పాలనపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాలని చెప్పారు.

ప్రజాస్వామ్యంలో నియంతల నియంత్రణకు శాసన మండలి శాశ్వత సభగా ఉండాలన్నారు. ప్రజాస్వామ్య నియంతలా జగన్‌ మారారని దుయ్యబట్టారు. ప్రజా ప్రయోజనాల పరిరక్షణకు ఎగువ సభలు ముఖ్యమని తెలిపారు. రాజ్యసభ శాశ్వత సభగా ఉందని గుర్తు చేసిన ఆయన.. శాసన మండలి కూడా శాశ్వత సభలా ఉండాల్సిందేనని చెప్పారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలన్నారు.

Related posts