telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ చేనేతలకు చేసిందేమీ లేదు: టీడీపీ నేత అనురాధ

Anuradha Tdp

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శలు గుప్పించారు. ఏడాది పాలనలో జగన్ చేనేతలకు చేసిందేమీ లేదన్నారు. మూడున్నర లక్షల మంది చేనేతల్లో సాయం 80 వేల మందికేనా.? అని ప్రశ్నించారు. జగన్ 14 నెలల పాలనలో గోరంత సాయం చేయలేదు. కొండంత ప్రచారం మాత్రం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.

3.50 లక్షల మగ్గాలు ఉంటే సాయం అందించింది ఎంత మందికి.? మంగళగిరిలో రెండు వేలకు పైగా మగ్గాలుంటే 303 మందికి మాత్రమే పథకం అందించారు. ఎన్నికలకు ముందు ప్రతి చేనేత కుటుంబానికి అని హామీ ఇచ్చి.. గెలిచాక మగ్గం ఉంటేనే అంటూ లక్షలాది మంది చేనేతలను వంచించారన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక అవస్థలు పడిన చేనేతలకు ఏం చేశారని నిలదీశారు.

Related posts