ఇసుక వారోత్సవాలపై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విటర్ లో విమర్శనాస్త్రాలు సంధించారు. ఇసుక వారోత్సవాలని ఏపీ సీఎం జగన్ చెబితే ప్రజలకి ఇసుక అందుబాటులోకి తీసుకొస్తారనుకుని పొరపాటు పడ్డానని అన్నారు. ‘జగన్ గారు అన్నది ఇసుక ‘వార్’ ఉత్సవాలు అని తరువాత అర్థం అయ్యిందని ఎద్దేవా చేశారు. ఇసుక వార్ లో భాగంగా ఇసుక వాటాల కోసం వైకాపా నాయకులు కర్రలతో దాడులు చేసుకొని, తలలు పగలు కొట్టుకుంటున్నారు’ అని దుయ్యబట్టారు.
ఒక పక్క వైసీపీ నాయకులు ఇసుకలో వాటాల కోసం వీధి రౌడీల్లా కొట్టుకుంటున్నారని ఆరోపించారు. జగన్ గారి చేతగాని పాలనకి గుంటూరు జిల్లా, పెదకాకానిలో మరో భవన నిర్మాణ కార్మికుడు పీట్ల శ్రీను ఆత్మహత్యకు పాల్పడ్డాడని లోకేశ్ విమర్శించారు. ‘వైకాపా ఇసుక వార్ ఉత్సవాలు, ఇసుక పంచాయితీలు ఆపి కార్మికులకు బతుకు భరోసా ఇవ్వండి జగన్ గారూ’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.