telugu navyamedia
రాజకీయ వార్తలు

“మహా” ప్రభుత్వ ఏర్పాటు పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Supreme Court

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 24 గంటల్లో మెజార్టీని నిరూపించుకోవాలని ఆదేశించింది. రాజ్ భవన్ మెజార్టీని నిర్ణయించలేదని తెలిపింది. కేవలం అసెంబ్లీ మాత్రమే మెజార్టీని నిరూపిస్తుందని పేర్కొంది. శాసనసభలోనే బలపరీక్ష జరగాలని ఆదేశించింది.

ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ మద్దతుతో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మ‌హారాష్ట్ర సీఎంగా ఫ‌డ్న‌వీస్ రెండవసారిప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 24 గంటల్లో మెజార్టీని నిరూపించుకోవాలని ఆదేశించింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి.

Related posts