టీడీపీ నేత, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తన పట్ల దురుసుగా ప్రవర్తించిందని ఎస్సై అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మంగళగిరి పోలీసులు నన్నపనేనిపై కేసు నమోదు చేశారు. నన్నపనేని ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాడు వైఎస్ఆర్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నేతృత్వంలోదళిత సంఘాలు ర్యాలీ నిర్వహించారు. దళిత ఎస్ఐను కించపర్చేలా మాట్లాడడం సరైంది కాదని ఎమ్మెల్యే ఆర్కే అభిప్రాయపడ్డారు.
ఈ విషయమై చంద్రబాబు దళితులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళ కమిషన్ చైర్పర్సన్ గా పనిచేసిన నన్నపనేని రాజకుమారి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. మరో వైపు డీజీపీ గౌతం సవాంగ్ను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కలిసి, అరెస్ట్ చేయాలని వినతిపత్రం అందజేశారు.