telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అన్న‌పూర్ణ ప‌థ‌కం దేశ‌ వ్యాప్తంగా గుర్తింపు: మంత్రి తలసాని

talasani srinivasayadav on clp merger

ఐదు రూపాయలకే నాణ్య‌మైన భోజ‌నాన్ని అందిస్తున్న అన్న‌పూర్ణ ప‌థ‌కం దేశ‌ వ్యాప్తంగా గుర్తింపు పొందింద‌ని తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నగరంలో అన్న‌పూర్ణ భోజన ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టి ఆరు సంవ‌త్స‌రాలు పూర్తయింది. ఈ సందర్భంగా అమీర్‌పేట్‌లో నిర్వ‌హించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, అన్న‌పూర్ణ ప‌థ‌కాన్ని రూపొందించిన సోమేశ్ కుమార్‌ను, నాణ్య‌మైన భోజ‌నాన్ని అందిస్తున్న హ‌రే కృష్ణ ఫౌండేష‌న్ ల‌ను అభినందిస్తున్నట్టు చెప్పారు.

సోమేశ్ కుమార్ గ‌తంలో జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌గా ఉన్న సమయంలో ఈ ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టారని, 2014 మార్చి 1న నాంప‌ల్లి రైల్వే స్టేష‌న్ వ‌ద్ద ప్రారంభించారని గుర్తుచేసుకున్నారు.అప్పుడు 8 కేంద్రాల‌తో రోజుకు 2,500 మందికి ఈ పథకం ద్వారా భోజనం అందించామని అన్నారు. ఈ పథకాన్ని ద‌శ‌ల‌వారీగా న‌గ‌రంలో 150 కేంద్రాల‌కు విస్తరించడం ద్వారా ప్ర‌తిరోజు 30,000 నుండి 35,000 మంది ఆక‌లిని తీరుస్తోందని వివరించారు.

Related posts