ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సహా ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల సంఘానికి కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ లేఖ రాశారు. తన బదిలీ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపనలు రుజువు చేయాలని లేదా పిర్యాదు చేసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీకి లేఖ రాశారు. ముప్పై ఏళ్లుగా నిజాయతీతో విధులు నిర్వహిస్తున్న తమపై వేటు వేయడంతో ఒక్కసారిగా నా బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యుల ముందు పరువు పోయిందనీ పేర్కొన్నారు. నాపై ఆరోపణలు నిరూపించాలి లేదా నాపై తప్పుడు ఆరోపణలు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.