ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం సృష్టించిన తొమ్మిది మంది టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. టీడీపీ హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశంపై చర్చిస్తున్న సందర్భంలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో, సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్న సభ్యులను సస్పెండ్ చేశారు.
టీడీపీ శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, వెలగపూడి రామకృష్ణ బాబు, బెందాళం అశోక్, వీరాంజనేయస్వామి, మద్దాల గిరి, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, గద్దె రామ్మోహన్ లను ఈ ఒక్కరోజుకి సస్పెండ్ చేయాలంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానం చేశారు. వెంటనే స్పనించిన స్పీకర్ తమ్మినేని వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు.
కేసీఆర్ కీ ఇచ్చినప్పుడే ఈటల మాట్లాడుతారు: జగ్గారెడ్డి