*పంజాబ్లో క్లీన్ ‘స్వీప్’ దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ
*పంజాబ్ ఆప్ అఖండ విజయం
*బీజేపీ కాంగ్రెస్ ను చీపురుతో ఊడ్జేసిన ఆప్
*ఢిల్లీలో ఆప్ కార్యకర్తల సంబరాలు..
*మ్యాజిక్ ఫిగర్ దాటిన అమ్ ఆద్మీ పార్టీ..
*మెజార్టీ సీట్లు దక్కించుకున్న ఆప్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ బంపర్ మెజారిటీ సాధించి అధికారం దిశగా దూసుకెళుతోంది. దీంతో అటు పంజాబ్లోనూ, ఇటు ఢిల్లీలోనూ ఆ పార్టీ కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం పంజాబ్లో 90 స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో ఉండగా.. అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 17 సీట్లలోనే ముందంజలో ఉంది. అదేవిధంగా బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది..
ఈ ఫలితాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు ఈ మేరకు పంజాబ్లో కాబోయే సీఎం భగవంత్ మాన్తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు.
పంజాబ్లో ఈ మార్పు రావడానికి కారణమైన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పంజాబ్ తాజా ట్రెండ్స్ ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన మెజారిటీతో దూసుకెళ్తోంది. ఆప్ ప్రభుత్వమే ఏర్పాటు కానుంది.
इस इंक़लाब के लिए पंजाब के लोगों को बहुत-बहुत बधाई। pic.twitter.com/BIJqv8OnGa
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 10, 2022