telugu navyamedia
రాజకీయ

వీవీ ప్యాట్‌ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ.. ఈనెల 25కు వాయిదా! 

supreme court two children petition
ఈవీఎంల ద్వారా జరుగుతున్న ఓటింగ్‌ ప్రక్రియపై అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో వీవీ ప్యాట్‌ను లెక్కించాలని విపక్ష పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ  పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. వీరి పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో కోర్టుకు వివరాలు అందించేందుకు ఓ సినియర్‌ అధికారిని నియమించాలని ప్రధాన న్యాయమూర్తి కోరారు. తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేశారు.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తప్పనిసరిగా 50 శాతం వీవీప్యాట్‌లను లెక్కించి, వాటిని ఈవీఎంలతో సరిపోల్చేలా నిబంధన తీసుకురావాలని 23 రాజకీయ పార్టీలు గత నెలలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్‌, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, ఎస్పీ, బీఎస్పీ ఎంపీలు రాంగోపాల్‌యాదవ్‌, సతీష్‌ చంద్ర మిశ్రాల నేతృత్వంలోని 21 పార్టీల నేతలు  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

Related posts