కరోన నియంత్రణకు ఏపీ ప్రభుత్వం తీసుకునే చర్యలపై టీడీపీ నేత కళా వెంకట్రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుంటే మద్యం దుకాణాలు తెరుస్తారా? అని మండిపడ్డారు. ప్రపంచమంతా కరోనా నివారణ కోసం మందు తయారు చేసే పనిలో ఉందని, సీఎం జగన్ మాత్రం తన కమిషన్ కోసం మద్యం తయారు చేయించే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. విపత్కర పరిస్థితిలో మద్యం తయారు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు.
రాష్ట్రంలోని ఆర్థిక ఇబ్బందుల్లో రైతులు వున్న ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన అన్నారు. వారిని ఆదుకునే ప్రయత్నాలను ఏపీ ప్రభుత్వం చేయట్లేదని తెలిపారు. రాష్ట్రంలో వాలంటీర్లు నాటు సారా తయారు చేస్తున్నారని కళా వెంకట్రావు ఆరోపించారు. మద్యం దుకాణాలకు బదులు అన్న క్యాంటీన్లు తెరవాలని ఆయన డిమాండ్ చేశారు.
చేపపిల్లలను వదిలిన మంత్రి జగదీష్ రెడ్డి…