ప్రతి సంవత్సరం అమెరికాలో నిర్వహించే తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) మహాసభలకు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ దంపతులకు ఆహ్వానం లభించింది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో ప్రత్యేకతను చాటుకుంటున్న ప్రముఖులను తానా ఆహ్వానించటం ఆనవాయితీగా వస్తుంది.
అదే తరహాలో అతి చిన్న వయస్సులో ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న గిరిజన మహిళ ఎమ్మెల్యే హరిప్రియ కావటంతో ఆ దంపతులను తానా మహాసభల నిర్వాహకులు జయరాం కోమటి, గంగాధర్ నాదెండ్ల, సతీష్ వేమన, జయశేఖర్ తాల్లురి, సభ్యులు సందీప్ నుంచి ఆహ్వానం అందింది. దీంతో వచ్చే నెల 4 నుంచి 6 వరకు అమెరికాలో జరిగే 22 వ తానా సభలో ఎమ్మెల్యే హరిప్రియతో పాటు భర్త హరిసింగ్ నాయక్ పాల్గొననున్నారు. నూతనంగా ఏర్పడ్డ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి తానా సభలకు వెళ్లనున్న తొలి ఎమ్మెల్యే హరిప్రియ కావటం విశేషం.