నేడు తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.
ఇఫ్తార్ విందు ఏర్పాట్లను టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, నాగుల్మీరాలు పరిశీలించారు.