telugu navyamedia
ఆంధ్ర వార్తలు

గోరంట్ల మాధవ్‌ న్యూడ్ వీడియోపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు

వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియోపై లోక్ సభ స్పీకర్ కు టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. మంగళవారం నాడు న్యూఢిల్లీలోటీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. గోరంట్లపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరామన్నారు

ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా వ్యవహరించడంతో అందరు ఎంపీలు ఇలానే ఉంటారా అనే అనుమానం ప్రజలకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ విషయమై స్పీకర్ బీర్లా కు తాము లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్టుగా చెప్పారు..

ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్య తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తుంటే ఈ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం వైసీపీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఎంపీ మాధవ్ వ్యవహరాన్ని ఎలా మేనేజ్ చేయాలనే విషయమై వైసీపీ ప్రయత్నిస్తుందన్నారు.

వైసీపీలో గోరంట్ల మాధవ్‌ ఒక్కరే కాదని, ఎంతోమంది ఉన్నారని అన్నారు. మాధవ్ పై చర్యలు తీసుకొంటే వైసీపీలోనే చాలామందిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందనే భయంతో ఆ పార్టీ ఈ విషయమై వెనుకాడుతుందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. మహిళల గౌరవం కాపాడేందుకు టీడీపీ పోరాటం చేస్తుందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

బీజేపీతో వైసీపీ అత్యంత సన్నిహితంగా ఉందని చెప్పుకొనేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తుందన్నారు. కానీ రాష్ట్రానికి చెందిన సమస్యల విషయంలో వైసీపీ ఎంపీలు ఏం చేయడం లేదన్నారు.

ప్రత్యేక హోదా సహా రాష్ట్రానికి చెందిన సమస్యలపై మాత్రం వైసీపీ ఎంపీలకు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. కానీ జగన్ కు సంబంధించిన కేసుల విషయమై వైసీపీ ఎంపీలు మాత్రం ఢిల్లీ మొత్తం తిరుగుతారన్నారు..

Related posts